జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు: సీపీఐ రామకృష్ణ

  • అందరి అభిప్రాయాలను సేకరించి ఓ నివేదిక తయారు చేస్తాం
  • రాజధాని విషయంలో జగన్ వైఖరి సరికాదు  
  • కేబినెట్ భేటీ 27న జరిగింది
  • రాజధానిపై విజయసాయిరెడ్డి 26వ తేదీనే ఎలా మాట్లాడతారు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. విజయవాడ ఐఎంసీ హాలులో ఆయన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను సేకరించి ఓ నివేదిక తయారు చేసి విడుదల చేస్తామని తెలిపారు.

రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొన్ని రోజుల ముందు ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే, కేబినెట్ భేటీ 27వ తేదీన జరిగితే రాజధాని విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 26వ తేదీనే ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Go Back to Shorts
Jagan
cpi
cpm

More Telugu News